- విద్యార్థి సంఘాల నాయకులు
బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా విద్యారంగం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వ్యంలో విద్యారంగం లో వెనుక బడ్డ నిజామాబాద్ జిల్లా అనే అంశం పై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొన్ని ఏళ్లుగా విద్యా వ్యవస్థ లో ఉన్న సమస్యలను పునరావృతం చేస్తున్నారన్నారు. ప్రజల, విద్యార్థుల, విద్యార్థి సంఘాల దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జిల్లాకు కొత్తగా విద్యా వ్యవస్థను కేటాయించకుండా మొండి చేయి చూపిస్తున్నారని తెలిపారు. జిల్లాకు కీటయించి బీ టెక్ కళాశాలకు నిధులు కేటాయించకుండా జాప్యం చేయడం సబబు కాదన్నారు. త్వరిత గతిన నిధులు కేటాయించి కళాశాలను అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీ జీ వీ పీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్, టీ జీ వీ పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జనమ్ భాను చందర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు రఘురాం, AIPSU నాయకుడు బోడ అనిల్ టీవీయువి సంఘం నాయకుడు లాల్ సింగ్, ఏ ఐ ఏస్ఎఫ్, టీ వీ యూవీ, ఏ ఐ పీ ఎస్ యూ నాయకులు, టీ జీ వీ పీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాల నాగేష్ పాల్గొన్నారు.






