హజీపూర్ తాండాలో 12 ఎకరాలలో ఆటవి ప్రాంతం ధ్వంసం
. . . ద్వంసం చేసిన తోమ్మిది మందిపై కేసులు
బతుకమ్మ, ఎల్లారెడ్డి:
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ పరిధిలోని హాజీపూర్ బీట్లో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రాత్రి పూట ఆక్రమణలు అడవిలోని చెట్లు, పొదలను నరికి దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు. మండలంలోని హాజీపూర్ తండాకు చెందిన కొందరు అటవీలోని గత వారం రోజుల నుంచి చెట్లను నరికేస్తున్నారు. గతంలో చెట్లను నరికి భూములను చదును చేసి పంటలను పండిస్తున్నారు..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆటవి రేంజ్ పరిధిలో గత 24 గంటల కాలంలో 12 ఎకరాలలో ఆటవి ప్రాంతంను ధ్వంసం చేసి చదును చేసేందుకు యత్నించిన తోమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎప్ఆర్ఓ ఓంకార్ తెలిపారు. ఎల్లారెడ్డి ఆటవి రెంజ్ పరిధిలోని బోల్లారం సెక్షన్ లోని లక్ష్మాపూర్ బీట్ పరిధిలోని హజీ పూర్ తాండా ప్రాంతంలో సోమవారం ఆటవి ప్రాంతంను ధ్వంసం చేసి చదును చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు రెంజ్ అధికారితో పాటు ఆటవిశాఖ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు.ఈ నెల 9న ఆటవి ప్రాంతంను ధ్వంసం చేసిన ఫకిరా, రాంషా, లాల్, రమేష్ లపై కేసులు నమోదు చేసి పోలిస్ లకు పిర్యాదు చేసి ఎప్ఐఆర్ లను నమోదు చేయించినట్లు తెలిపారు. మంగళవారం హజీపూర్ తాండాలో ఆడవి పోధలను తోలిగించి భూమిని చదును చేసినట్లు సమాచారం అందడంతో అక్కడికి ఎప్ఆర్ఓ ఇతర సిబ్బంది వేళ్లి పరిశీలించారు. అక్కడ చెట్లను నరికి చదును చేసిన హజీపూర్ తాండాకు చెందిన నరేష్, తారా చంద్, కిషన్ నాయక్, శంకర్, రవి లపై కేసులు నమోదు చేసినట్లు ఎప్ఆర్ఓ తెలిపారు. రిజర్వు ఆటవి ప్రాంతంలో సాగు నిషేదం అని ఈ విషయంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటవి ప్రాంతంలో ప్రవేశించిన చెట్లను నరికిన, భూముల ఆక్రమణ చట్ట రిత్యా నేరమని అందుకు ఆటవిశాఖ చట్టం కేసులతో పాటు, పోలిస్ కేసులు నమోదు తప్పవని ఎప్ఆర్ఓ ఓంకార్ తెలిపారు.







