పోతంగల్, బతుకమ్మ : ఏ డీ ఎం ఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ బిజినెస్ పై శిక్షణ కార్యక్రమాన్నిపోతంగల్ మండలంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో స్థానిక నాయకుడు పబ్బా శేఖర్, డాక్టర్ మల్లెపూల గోపాల విఠలేశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి శిక్షకులుగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్స్ వజ్జా మహేందర్, వజ్జ నవనీతలు హాజరై కంపెనీ అందిస్తున్న బిజినెస్ అవకాశాన్ని, కంపెనీ అందిస్తున్న ఆదాయానికి సంబంధించిన శిక్షణను అందించారు.ఈ బిజినెస్ శిక్షణ కార్యక్రమం ద్వారా ఆర్థిక స్వాతంత్రం పొందాలని, ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆదాయం పైన ఆధారపడకుండా రెండవ రకమైన ఆదాయాన్ని కూడా ఏర్పరచుకోవాలని తద్వారా మాత్రమే ఆర్థిక స్వాతంత్రం సాధ్యమవుతుందని పబ్బ శేఖర్, మల్లెపూల గోపాల విఠలేశ్వర్ కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యాపారస్తులు, ఉద్యోగులు, యువత పాల్గొనడం జరిగింది.






